తెలంగాణ

telangana

By

Published : Feb 24, 2020, 7:23 PM IST

ETV Bharat / state

నర్సాపూర్​లో పట్టణ ప్రగతి కార్యక్రమం

మెదక్ జిల్లా నర్సాపూర్​లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలకంటే నర్సాపూర్​ను ఎక్కువ అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

PATTANA PRAGATHI IN NARSAPUR
నర్సాపూర్​లో పట్టణ ప్రగతి కార్యక్రమం

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పట్టణాలను అభివృద్ధి చేసేవిధంగా ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ఇందుకు సంబంధించి నర్సాపూర్​లోని పదిహేను వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వార్డుల కౌన్సిలర్​లకు సూచించారు.

అన్ని వార్డుల్లో చేపట్టే పనుల గురించి ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నర్సాపూర్ పట్టణాన్ని తెలంగాణాలోని అన్ని పట్టణాల కంటే ఎక్కువ అభివృద్ధి చేయటానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ మురళీ యాదవ్ మరియు అన్ని వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.

నర్సాపూర్​లో పట్టణ ప్రగతి కార్యక్రమం

ఇవీ చూడండి:వాహ్​ తాజ్​: ప్రేమాలయం అందాలకు ట్రంప్​ ఫిదా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details