తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2021, 7:00 PM IST

ETV Bharat / state

'మిషన్ భగీరథ దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది'

మిషన్ భగీరథ పథకం దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మిషన్ భగీరథ పనులను ఆమె సమీక్షించారు.

Mission Bhagiratha most prestigious in the country
మిషన్ భగీరథ దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మిషన్ భగీరథ పనులను... ఇన్​ఛార్జ్​ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జితేందర్ రెడ్డిలతో కలిసి సమీక్షించారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

సురక్షితమైన మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో సింగూర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రామాయంపేట పట్టణంలో 300 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించినట్లు చెప్పారు. త్వరలోనే వాటిని లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మంచి ప్రగతిని కనబరుస్తున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: లాఠీఛార్జ్ చేసిన సీఐపై హత్యాయత్నం కేసు పెట్టాలి: బండి

ABOUT THE AUTHOR

...view details