తెలంగాణ

telangana

మెదక్​ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

By

Published : Jun 8, 2020, 3:10 PM IST

కరోనా కారణంగా గత కొన్నిరోజులుగా మూతపడ్డ ఆలయాలన్నీ నేడు పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మెదక్​లోని సీఎస్​ఐ చర్చిలో భక్తులకు ప్రవేశం కల్పించారు.

Admissions to the devotees in the Medak church
మెదక్​ చర్చిలో భక్తులకు ప్రవేశం

లాక్​డౌన్ సడలింపులతో రాష్ట్రంలోని దేవాలయాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్ సీఎస్ఐ చర్చిలో భక్తులకు ప్రవేశం కల్పించారు. థర్మల్​ స్క్రీనింగ్, శానిటైజేషన్​ చేసిన తర్వాతే ప్రార్థనా మందిరంలోకి అనుమతిస్తున్నారు. భక్తులంతా విధిగా భౌతిక దూరం పాటించాలని మత గురువు విజయ్​ కుమార్​ సూచించారు. కరోనా నేపథ్యంలో చర్చి వద్ద భక్తుల సందడి అంతగా కనిపించటం లేదు.

ABOUT THE AUTHOR

...view details