లాక్డౌన్ సడలింపులతో రాష్ట్రంలోని దేవాలయాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్ సీఎస్ఐ చర్చిలో భక్తులకు ప్రవేశం కల్పించారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేసిన తర్వాతే ప్రార్థనా మందిరంలోకి అనుమతిస్తున్నారు. భక్తులంతా విధిగా భౌతిక దూరం పాటించాలని మత గురువు విజయ్ కుమార్ సూచించారు. కరోనా నేపథ్యంలో చర్చి వద్ద భక్తుల సందడి అంతగా కనిపించటం లేదు.