తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2020, 4:06 PM IST

ETV Bharat / state

రైతు సమస్యల పరిష్కారానికై ఈ పోర్టల్​: ఎమ్మార్వో

మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్​లో ఎమ్మార్వో మహమ్మద్ జమీర్​.. తన కార్యాలయంలో ధరణి పోర్టల్​ సేవలను ప్రారంభించారు. రైతు సమస్యల పరిష్కారానికై ఈ పోర్టల్ అని వ్యాఖ్యానించారు.

Dharani Portal Latest News
రైతు సమస్యల పరిష్కారానికై ఈ పోర్టల్​: ఎమ్మార్వో

సీఎం కేసీఆర్ రైతు సమస్యల పరిష్కారం కోసం.. రూపొందించిన ధరణి పోర్టల్​ను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించగా... మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్​లో ఎమ్మార్వో మహమ్మద్ జమీర్​.. తన కార్యాలయంలో ధరణి పోర్టల్​ సేవలను ప్రారంభించారు.

రైతు సమస్యల పరిష్కారానికై ఈ పోర్టల్​: ఎమ్మార్వో

వెబ్​సైట్​ ద్వారా నలుగురు రైతులకు క్రయ విక్రయాలకు సంబంధించి పాస్​ బుక్కులను సైతం 15 నిమిషాల్లో జారీ చేశారు. వ్యవసాయ భూములను క్రయవిక్రయాలు కోసం మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ధరణిలో రిజిస్ట్రేషన్ సేవలను ఎమ్మార్వో కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని మహమ్మద్ జమీర్​ తెలిపారు. ధరణి వెబ్​సైట్​పై కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని... రైతులు తమ సమస్యలను నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. ధరణి వెబ్​సైట్​ ద్వారా క్రయ విక్రయాలు జరిపిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

ధరణి పోర్టల్​తో సంతోషం వ్యక్తం చేస్తున్న మహిళా రైతు

ఇదీ చూడండి:దుబ్బాక ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేసిన అధికారులు

ABOUT THE AUTHOR

...view details