తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ ఉన్నంత వరకూ భాజపా ఆటలు సాగవు: బాల్క సుమన్​

పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాలని ప్రభుత్వ విప్​ బాల్క సుమన్ సూచించారు​. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నమోదును ఓ పండగలా జరపాలని కార్యకర్తలను కోరారు.

By

Published : Feb 16, 2021, 12:01 PM IST

govt vip balka suman attends trs membership registration in bellampalli mancherial
'కేసీఆర్ ఉన్నంతవరకూ భాజపా ఆటలు సాగవు'

కేసీఆర్ ఉన్నంత వరకూ రాష్ట్రంలో భాజపా ఆటలు సాగవన్నారు ప్రభుత్వ విప్​ బాల్క సుమన్. ప్రభుత్వం చేపడుతోన్న పలు అభివృద్ధి పనులకు.. కాషాయ పార్టీ అడ్డు పడుతోందని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం​లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్​, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ సతీశ్​, జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ భాగ్యలక్ష్మి, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:విపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: వినయ్​ భాస్కర్​

ABOUT THE AUTHOR

...view details