తెలంగాణ

telangana

By

Published : Apr 5, 2020, 5:30 PM IST

ETV Bharat / state

వలస కూలీలకు జైపూర్​ పోలీసుల చేయూత

మంచిర్యాల జిల్లా జైపూర్​ మండల పోలీసుల తమ ఉదారతను చాటుకున్నారు. సొంత ఊళ్లకు వెళ్లలేని వలస కూలీలకు రూ. 70 వేల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

వలస కూలీలకు జైపూర్​ పోలీసుల చేయూత
వలస కూలీలకు జైపూర్​ పోలీసుల చేయూత

మంచిర్యాల జిల్లా జైపూర్​ మండల పోలీసులు వలస కూలీలకు సహాయమందించారు. లాక్ డౌన్ జరుగుతున్నందున సొంత గ్రామాలకు వెళ్లలేక మంచిర్యాల జిల్లా ఇందారంలో చిక్కుకుపోయిన రాజస్థాన్​, ఏపీ, భూపాల పల్లి ప్రాంతాలకు చెందిన వలస కూలీలకు సరుకులు పంపిణీ చేశారు. సోపతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు చెందిన వారికి రూ. 70 వేల నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్​ సీఐ కోటేశ్వర్​, జైపూర్​ ఎస్సై విజయేందర్​, గంగరాజు, శ్రీరాంపూర్​ ఎస్సై మంగీలాల్​ పాల్గొన్నారు.

వలస కూలీలకు జైపూర్​ పోలీసుల చేయూత

ABOUT THE AUTHOR

...view details