మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పోలీసులు వలస కూలీలకు సహాయమందించారు. లాక్ డౌన్ జరుగుతున్నందున సొంత గ్రామాలకు వెళ్లలేక మంచిర్యాల జిల్లా ఇందారంలో చిక్కుకుపోయిన రాజస్థాన్, ఏపీ, భూపాల పల్లి ప్రాంతాలకు చెందిన వలస కూలీలకు సరుకులు పంపిణీ చేశారు. సోపతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు చెందిన వారికి రూ. 70 వేల నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సీఐ కోటేశ్వర్, జైపూర్ ఎస్సై విజయేందర్, గంగరాజు, శ్రీరాంపూర్ ఎస్సై మంగీలాల్ పాల్గొన్నారు.
వలస కూలీలకు జైపూర్ పోలీసుల చేయూత
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పోలీసుల తమ ఉదారతను చాటుకున్నారు. సొంత ఊళ్లకు వెళ్లలేని వలస కూలీలకు రూ. 70 వేల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
వలస కూలీలకు జైపూర్ పోలీసుల చేయూత