తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్ భగీరథ పనులపై స్మిత సమీక్ష

ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులను సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

By

Published : Feb 15, 2019, 8:56 PM IST

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన సీఎంవో

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన సీఎంవో
పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లిలో మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్ పరిశీలించారు. డిజిటలైజేషన్, నీటి పంపింగ్ విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. పచ్చదనం కోసం మొక్కలు ఏర్పాటు చేయాలని గుత్తేదారులకు సూచించారు. ప్రాజెక్టు పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలతో పాటు 337 ఆవాసాలకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించాలని అధికారులను స్మిత ఆదేశించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details