తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబ్​నగర్​లో తెదేపా విస్తృత స్థాయి సమావేశం

మహబూబ్​నగర్​ పార్లమెంట్​ పరిధిలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. కుటుంబ పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి తెలుగు తమ్ముళ్లు సిద్దమవుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాశీనాథ్​ తెలిపారు.

By

Published : Sep 12, 2019, 10:45 PM IST

మహబూబ్​నగర్​లో తెదేపా విస్తృత స్థాయి సమావేశం

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో తెదేపా పార్లమెంట్​ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. దోపిడి వ్యవస్థను, కుటుంబ పాలనతో మనుగడ సాగిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి సమాయత్తమవుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాశీనాథ్​ అన్నారు. ఎంత మంది నాయకులు బయటకు వెళ్లినా.. కార్యకర్తలు అండగా నిలబడ్డారని తెలిపారు. భవిష్యత్​లో బలమైన శక్తిగా తెలుగుదేశం ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెరాసలో ఓనర్​షిప్​ పంచాయితీ నడుస్తోందని.. రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్​ నియోజకవర్గాన్ని ఒక యూనిట్​గా తీసుకొని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.

మహబూబ్​నగర్​లో తెదేపా విస్తృత స్థాయి సమావేశం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details