తెలంగాణ

telangana

'మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా'

లాక్​డౌన్​ సడలించిన ప్రాంతాలు, రెడ్​జోన్ల నుంచి వచ్చే వారిని ఎక్కడికక్కడే క్వారంటైన్​కు తరలించాలని మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులకు సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ, లాక్​డౌన్​ అమలుపై సమీక్ష నిర్వహించారు.

By

Published : May 9, 2020, 11:43 AM IST

Published : May 9, 2020, 11:43 AM IST

mahabubnagar district collector venkat rao review on corona
మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టర్ వెంకట్రావు సమీక్ష

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్​డౌన్​ అమలుపై జిల్లా అధికారులతో మహబూబ్​నగర్​ కలెక్టర్ వెంకట్రావు సమీక్ష నిర్వహించారు. రెడ్​జోన్ ప్రాంతాల నుంచి‌ జిల్లాకు వచ్చేవారిని ఎక్కడికక్కడే క్వారంటైన్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అన్ని మండలాలు, గ్రామాల్లోని పాఠశాలలు, ఇతర భవనాలను గుర్తించి క్వారైంటన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించినట్లయితే తక్షణమే జిల్లా అధికారులకు తెలియజేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కలెక్టర్‌ సూచించారు. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లైతే వెయ్యి రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details