తెలంగాణ

telangana

శరవేగంగా కురుమూర్తి ఆలయం రాజ గోపుర నిర్మాణ పనులు

పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మహబూబ్​నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి ఆలయం సరికొత్త రూపును సంతరించుకోనుంది. ప్రధాన ద్వారంలో.. నూతన రాజ గోపుర నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి.

By

Published : Jan 18, 2021, 12:34 PM IST

Published : Jan 18, 2021, 12:34 PM IST

Kurumurthy Temple  rajagopuram works started in mmahabubanagar district
శరవేగంగా కురుమూర్తి ఆలయం రాజ గోపుర నిర్మాణ పనులు

మహబూబ్​నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్​ కురుమూర్తి ఆలయంలో.. రాజ గోపుర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిలు ఈ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

నిర్వాహకులు ఆలయ పాత ప్రధాన ద్వారాన్ని యంత్రాల సాయంతో నేలమట్టం చేసి, నూతన గోపుర నిర్మాణానికి పునాది పనులను ప్రారంభించారు. భక్తుల దర్శనార్థం.. ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మేడారం చిన్న జాతర

ABOUT THE AUTHOR

...view details