తెలంగాణ

telangana

ETV Bharat / state

వసతి గృహ ప్రిన్సిపల్​పై కొడంగల్ ఎమ్మెల్యే ఆగ్రహం

మహబూబ్​నగర్​ జిల్లా కస్తూర్బా వసతి గృహంలో మధ్యాహ్న బోజనం వికటించి విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. నాణ్యమైన భోజనం అందించాలని వసతి గృహ ప్రిన్సిపల్​పై కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి మండిపడ్డారు.

By

Published : Aug 11, 2019, 8:39 PM IST

వసతి గృహ ప్రిన్సిపాల్​పై కొడంగల్ ఎమ్మెల్యే ఆగ్రహం

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలం బలంపేటలోని కాస్తూర్బా వసతి గృహంలో విద్యార్థినిలు మధ్యాహ్న బోజనం వికటించి శనివారం అస్వస్థతకు గురయ్యారు.ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి కస్తూర్బా వసతి గృహాన్ని ఆదివారం సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మంచి విద్యను అందించాలని అన్నారు. వసతి గృహంలో భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ఇస్తున్న అటుకులలో పురుగులుండటం చూసి వసతి గృహ ప్రిన్సిపల్​పై ఎమ్మెల్యే మండిపడ్డారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

వసతి గృహ ప్రిన్సిపాల్​పై కొడంగల్ ఎమ్మెల్యే ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details