తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏనుకుంట రిజర్వాయర్​లోకి చేప పిల్లల విడుదల

వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ఏనుకుంట రిజర్వాయర్​లోకి దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్​రెడ్డి  చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల జీవనోపాధి కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే తెలిపారు.

By

Published : Aug 25, 2019, 11:17 AM IST

ఏనుకుంట రిజర్వాయర్​లోకి చేప పిల్లల విడుదల

నపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల గ్రామం ఏనుకుంట రిజర్వాయర్​లోకి 76,000 చేప పిల్లలను దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్​రెడ్డి విడుదల చేశారు. అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్​ను అందించారు. మత్స్యకారులు చేపలను మధ్యవర్తులకు అందించకుండా తామే వ్యాపారం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గత మూడేళ్లుగా మన రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని తద్వారా కొత్తకోట ఉమ్మడి మండలానికి రూ.26 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

ఏనుకుంట రిజర్వాయర్​లోకి చేప పిల్లల విడుదల

ABOUT THE AUTHOR

...view details