మహబూబ్నగర్ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా కోటి విత్తన బంతులను తయారు చేసి వెదజల్లేందుకు నిర్ణయించింది జిల్లా యంత్రాంగం. అనుకున్నదే తడువుగా.. పాలమూరు జిల్లా మహిళా సంఘాల ఆధ్వర్యంలో కోటి విత్తన బంతుల తయారీ పూర్తి చేసి.. వాటిన వెదజల్లడం ప్రారంభించింది.
మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాన్ని రెండు రోజులు పొడగించారు. దీంతో లక్ష్యానికి మించి విత్తన బంతులను వెదజల్లినట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు.