తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం రైతులను హీనంగా చూస్తున్నారు: చాడ

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను హీనంగా చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్​లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు.

By

Published : Sep 6, 2019, 8:33 PM IST

చాడ వెంకట్​ రెడ్డి

ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వకుండా.. అన్నదాతలను జైల్లో పెట్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి మండిపడ్డారు. మహబూబ్​నగర్​లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. భూసేకరణకు సంబంధించి ఎక్కడెక్కడ ఎంత పరిహారం చెల్లించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుడికిళ్లలో రైతులపై పోలీసుల దాడి అమానుషమైన చర్యగా అభివర్ణించారు. యురేనియం తవ్వకాలపై కేసీఆర్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపితే అగ్నిగుండమే అవుతుందని హెచ్చరించారు.

సీఎం రైతులను హీనంగా చూస్తున్నారు: చాడ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details