తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2019, 6:06 PM IST

ETV Bharat / state

8న కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశ భవిష్యత్తు అంధకారంలోకి పోయే విధంగా ఉన్నందున ఈ నెల 8న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడిని నిర్వహించనున్నారు.

8న కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేటట్లుగా ఉందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి మండిపడ్డారు. దేశ భవిష్యత్తు అంధకారంలోకి పోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యనిర్వాహక సమావేశంలో వంశీ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నియంతృత్వ పోకడలున్న నేతలు నాయకత్వం వహిస్తున్నారని... ప్రజాఉద్యమం చేస్తే తప్ప ఆర్థిక వ్యవస్థలో మార్పు తీసుకురాలేమని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టరేట్‌ల ముట్టడి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

8న కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details