తెలంగాణ

telangana

By

Published : Feb 12, 2021, 2:32 AM IST

ETV Bharat / state

'ప్రొఫెసర్ కోదండరామ్​కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి'

ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రొఫెసర్ కోదండరామ్ గెలుపును కోరుతూ విద్యార్థి ఐకాస చేపట్టిన బస్సు యాత్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. స్థానిక అమరవీరుల స్థూపం ముందు అమరవీరులకు నివాళులు అర్పించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

The bus journey undertaken by the student of oujac reached the district headquarters of Mahabubabad.
'ప్రొఫెసర్ కోదండరామ్​కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి'

ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రొఫెసర్ కోదండరామ్ గెలుపును కోరుతూ.. విద్యార్థి ఐకాస చేపట్టిన బస్సు యాత్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో.. స్థానిక అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉద్యోగాల సాధనకై నిరుద్యోగుల పక్షాన గొంతు వినపించడానికి ప్రొఫెసర్ కోదండరామ్​ను.. శాసన మండలికి పంపాలనే ఉద్దేశంతోనే ఈ బస్సు యాత్రను చేపట్టామని తెలిపారు. పట్టభద్రులు ప్రొఫెసర్ కోదండరామ్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేశామని.. నేడు సీఎం కేసీఆర్ ఆ ట్యాగ్ లైన్​ను మర్చిపోయారని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:మేయర్​ పీఠాన్ని అధిష్ఠించిన మహిళామణుల గురించి తెలుసా...?

ABOUT THE AUTHOR

...view details