తెలంగాణ

telangana

By

Published : Aug 19, 2019, 10:55 AM IST

ETV Bharat / state

గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక.. తీజ్

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన తీజ్ నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. తీజ్​ వేడుకల నిమజ్జనం రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించాలంటూ కోరారు.

గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక.. తీజ్

గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే తీజ్ వేడుకలకు ప్రభుత్వం ఒక రోజు సెలవు ప్రకటించాలని సీఎం కేసీఆర్​ను కోరుతానని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్ద తండాలో జరిగిన తీజ్ నిమజ్జన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తండాకు చెందిన ఆడపడుచులంతా నృత్యాలు చేసుకుంటూ, భారీ ఊరేగింపుతో వెళ్ళి తీజ్ బుట్టలను చెరువులో నిమజ్జనం చేశారు. పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రకృతి దేవతలను మొక్కుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్ ఆంగోతు బిందు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు.

గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక.. తీజ్

ABOUT THE AUTHOR

...view details