తెలంగాణ

telangana

ETV Bharat / state

గంటన్నరపాటు నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

summery: విజయవాడ​-కాజీపేట రైల్వే మార్గంలో ఓహెచ్​ఈ తీగలు తెగిపోవటం వల్ల పలు రైళ్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్​ జిల్లాలో రైళ్లు ఆగి ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురయ్యారు.

By

Published : Mar 30, 2019, 11:37 AM IST

నిలిచిపోయిన రైళ్లు

నిలిచిపోయిన రైళ్లు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ శివారులో ఓహెచ్​ఈ విద్యుత్ తీగలు తెగిపోవటంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లు గంటన్నర సేపు నిలిచిపోయాయి. కేసముద్రంలో గరీబ్​రథ్ ,మహబూబాబాద్​లో నాందేడ్, హుంసఫర్ ఎక్స్ ప్రెస్​లు, వరంగల్​లో పలు రైళ్ల ను నిలిపివేశారు. నెక్కొండ నుంచి ప్రత్యేక సిబ్బంది టవర్ కార్​లో చేరుకొని మరమ్మతులు చేసి, రైళ్లను నడిపించారు.సాంకేతిక లోపంతో మరో రైలు..
డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌లో మరో ప్యాసింజర్‌ సింగరేణి సుమారు గంటపాటు నిలిచిపోయింది. భద్రాచలం నుంచి బల్లార్షా వెళ్లే సింగరేణి రైలులో సాంకేతిక లోపం కారణంగా గంటపాటు అక్కడే ఆగిపోయింది. అధికారులు మరమ్మతులు చేపట్టిన అనంతరం అక్కడ నుంచి రైలు బయలుదేరి వెళ్లింది.
ఇలా రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details