తెలంగాణ

telangana

ETV Bharat / state

బయ్యారం చెరువును అభివృద్ధి పరుస్తాం: ఎర్రబెల్లి

బయ్యారం చెరువుకు లైనింగ్​ ఏర్పాటు చేసి అభివృద్ధి పరుస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. ఉక్కు కర్మాగారాన్ని కొట్లాడి తీసుకొస్తామన్నారు. సీఎం విధానాల వల్లే భూములు పెరిగాయని మహబూబాబాద్​ తెరాస సభలో దయాకర్​ రావు పేర్కొన్నారు.

By

Published : Mar 29, 2019, 2:22 PM IST

Updated : Mar 29, 2019, 3:12 PM IST

మహబూబాబాద్​ తెరాస సభలో మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్​ జిల్లాలోని బయ్యారం చెరువును అభివృద్ధి పరుస్తామని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు హామీ ఇచ్చారు. ఉక్కు కర్మాగారాన్ని నిజామాబాద్ ఎంపీ కవితతో కలిసి పోరాడి తీసుకొస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్నారు. సీఎం విధానాల వల్లే నేడు భూములు పెరిగాయని తెలిపారు. 70 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్​ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేంద్రంలో భాజపా కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని మహబూబాబాద్​ తెరాస సభలో మంత్రి ఎద్దేవా చేశారు.

మహబూబాబాద్​ తెరాస సభలో మంత్రి ఎర్రబెల్లి
Last Updated : Mar 29, 2019, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details