తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి ఎర్రబెల్లికి గ్రీన్​ ఛాలెంజ్ విసిరిన విద్యార్థులు

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు డివిజన్​ కేంద్రంలోని వందేమాతరం ఫౌండేషన్​ విద్యార్థులు వివిధ విత్తనాలతో లక్ష సీడ్​ బాల్స్​ చేశారు. వారికంటే ఒక్కటైనా ఎక్కువ తయారు చేయాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు విద్యార్థులు గ్రీన్​ ఛాలెంజ్​ విసిరారు.

By

Published : Jun 13, 2020, 2:37 PM IST

mahabubabad students green challenge to minister errabelli
మంత్రి ఎర్రబెల్లికి గ్రీన్​ ఛాలెంజ్ విసిరిన విద్యార్థులు

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు డివిజన్​ కేంద్రంలోని వందేమాతరం ఫౌండేషన్​ విద్యార్థులు.. 30 రకాల వివిధ విత్తనాలతో లక్ష సీడ్​ బాల్స్​ను తయారు చేస్తున్నారు. ఈ మేరకు పాలకుర్తి ఎమ్మెల్యే, పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు విద్యార్థులు గ్రీన్​ ఛాలెంజ్​ను విసిరారు.

పాలకుర్తిలో ప్రకృతి ప్రేమికులు ఎవరితోనైనా తాము చేసిన లక్ష సీడ్​ బాల్స్​ కంటే ఒక్కటైన ఎక్కువ సీడ్​ బాల్స్​ను తయారు చేయాలని మంత్రికి విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఇలా సీడ్​ బాల్స్​ను తయారు చేసి వాటిని నాటనున్నట్లు ఫౌండేషన్​ నిర్వహకులు తెలిపారు.

ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details