తెలంగాణ

telangana

కొవిడ్ విషయంలో అశ్రద్ధ పనికిరాదు: కలెక్టర్ గౌతమ్

కొవిడ్ తగ్గిందని ప్రజలు అశ్రద్ధ చేయవద్దని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. పలు రాష్టాల్లో మళ్లీ విజృంభిస్తోందని తెలిపారు. బయటకు వెళ్లే సమయంలో ప్రజలంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు.

By

Published : Feb 22, 2021, 1:41 PM IST

Published : Feb 22, 2021, 1:41 PM IST

Mahabubabad District Collector Gautam said people should not be negligent that covid has been reduced.
కొవిడ్ విషయంలో అశ్రద్ధ పనికిరాదు: కలెక్టర్ గౌతమ్

మహబూబాబాద్ జిల్లాలో ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఇప్పటి వరకు 10 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ గౌతమ్ కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.

ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు వ్యాక్సిన్‌ ఇచ్చాక 50ఏళ్లు పైబడిన సామాన్య ప్రజలకు అందిస్తామని గౌతమ్ పేర్కొన్నారు. కొవిడ్ తగ్గిందని ప్రజలు అశ్రద్ధ చేయవద్దని సూచించారు. బయటకు వెళ్లే సమయంలో ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు.

ఇదీ చదవండి: 'వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే పీవీకి సరైన గౌరవం'

ABOUT THE AUTHOR

...view details