తెలంగాణ

telangana

ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్​

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని పాఠశాలలను కలెక్టర్​ గౌతమ్​ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి ప్రభుత్వ వసతుల కల్పనపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

By

Published : Mar 18, 2021, 10:45 PM IST

Published : Mar 18, 2021, 10:45 PM IST

ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్​
ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్​

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను కలెక్టర్ గౌతమ్ సందర్శించారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై విద్యార్థినులకు బోధించి అవగాహన కల్పించారు. ప్రభుత్వ వసతుల కల్పనపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలియ జేసేందుకు ఫిర్యాదుల పెట్టెను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న వసతి, సౌకర్యాలతో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేరుస్తూ తల్లిదండ్రులకు పేరు తేవాలని కోరారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.

ఇదీ చదవండి: సకల జనుల హితంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌

ABOUT THE AUTHOR

...view details