తెలంగాణ

telangana

By

Published : May 28, 2021, 3:53 PM IST

ETV Bharat / state

Lockdown: లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించిన కలెక్టర్ గౌతమ్

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఎస్పీ కోటిరెడ్డితో కలిసి ఆయన జిల్లా కేంద్రంలో పర్యటించారు.

collector goutham and sp kotireddy examined lockdown implementation in mahabubabad
లాక్డౌన్ అమలు తీరును పరిశీలించిన కలెక్టర్ గౌతమ్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిలు లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించారు. పట్టణంలో ఉదయం 10 గంటల తరువాత లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. లాక్​డౌన్ సడలింపు సమయం దాటాక రహదారుల పైకి వచ్చే వాహనదారుల అనుమతులను పరిశీలిస్తున్నారు. అనుమతి లేకుండా వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తూ... జరిమానాలు విధిస్తున్నారు.

జమాండ్లపల్లి చెక్​పోస్ట్ వద్ద జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్వయంగా వచ్చి... వాహన తనిఖీలు చేశారు. రహదారులపైకి వచ్చే వారిని ఆపి... ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, అనుమతులు ఉన్నాయా, లేవా అని అడిగి తెలుసుకుంటున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని.. ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూపం పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి :Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details