తెలంగాణ

telangana

By

Published : Dec 26, 2019, 3:27 PM IST

ETV Bharat / state

నెహ్రూసెంటర్​లో సూర్యగ్రహణంపై అవగాహన కార్యక్రమం

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సూర్యగ్రహణంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Awareness program on solar eclipse in Nehrucenter
నెహ్రూసెంటర్​లో సూర్యగ్రహణంపై అవగాహన కార్యక్రమం

సూర్యగ్రహణం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్​లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సూర్యోత్సవ్​-2019 (సూర్య గ్రహణంపై అవగాహన) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రహణాన్ని వీక్షించేందుకు సోలార్ ఫిల్టర్ గ్లాసులను ఏర్పాటు చేశారు. ప్రజలు వీటి ద్వారా గ్రహణాన్ని వీక్షించారు.

గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూస్తే సూర్యకిరణాలు కంటిపై పడి రెటీనా దెబ్బతింటుందని జన విజ్ఞాన వేదిక సభ్యురాలు సరళా పేర్కొన్నారు. గ్రహణాన్ని ప్రత్యక్షంగా కాకుండా సోలార్ ఫిల్టర్ గ్లాసుల ద్వారా గానీ, ఎక్స్​రే ఫిలిమ్స్ ద్వారా గానీ చూస్తే ప్రమాదం ఉండదని తెలిపారు.

గ్రహణం పట్టిన సమయంలో ఆహార పదార్థాలు తినకూడదు అనేది ఒక అపోహ మాత్రమేనని.. గ్రహణ సమయంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణిలు అన్ని రకాల ఆహార పదార్థాలు తినొచ్చన్నారు. ఇలాంటి గ్రహణం మళ్లీ 530 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుందని ఆమె తెలిపారు.

నెహ్రూసెంటర్​లో సూర్యగ్రహణంపై అవగాహన కార్యక్రమం

ఇవీ చూడండి: దశాబ్ది సవాల్​: స్వచ్ఛ ఇంధనంతో పచ్చని జీవితం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details