తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రాంతీయ పార్టీల సమూహమే దేశానికి దిక్సూచి'

ఎన్నికలకు ఒక రోజే గడువుండటం వల్ల రోడ్​షోలతో తెరాస ప్రచార జోరు పెంచింది. ఖమ్మం జిల్లా కల్లూరులో పార్లమెంటు తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు తరఫున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్​షోలో పాల్గొన్నారు.

By

Published : Apr 9, 2019, 12:21 AM IST

తెరాస రోడ్​షో

జాతీయ రాజకీయాలు అస్పష్టంగా ఉన్నాయని తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు తరఫున రోడ్​షోలో పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీల సమూహమే దేశానికి దిక్సూచి కాబోతుందని స్పష్టం చేశారు. 16 ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని పేర్కొన్నారు. నామ నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం రోడ్​షోకు భారీగా తరలివచ్చిన ప్రజలు

ABOUT THE AUTHOR

...view details