తెలంగాణ

telangana

బైక్​ను ఢీకొన్న కారు.. యువకుడు మృతి

By

Published : Feb 11, 2021, 8:34 PM IST

వేగంగా వచ్చిన కారు బైక్​ను​ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఈ ప్రమాదం జరిగింది.

The car collided with the bike young man died in khammam
బైక్​ను ఢీకొన్న కారు.. యువకుడు మృతి

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు వేగంగా వచ్చి బైక్​ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం పోతిరెడ్డి గూడెంకు చెందిన యువకులు విక్రం, రాజులు బైక్​పై.. ఖమ్మం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విక్రమ్ మృతి చెందగా.. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:ఇద్దరు కూలీలను బలితీసుకున్న విద్యుదాఘాతం

ABOUT THE AUTHOR

...view details