బాబును బంధించిన అభిమానం.. సత్తుపల్లిలో నీరాజనం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కుమారుడి వివాహానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. బాబు వస్తున్నారనే విషయం తెలుసుకుని అభిమానులు, తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున వివాహ వేడుక వద్దకు తరలివచ్చారు. కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు వధూవరుల వద్దకు వెళ్లే క్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు చంద్రబాబును తమ సెల్ఫోన్ కెమెరాల్లో బంధించారు.
బాబును బంధించిన అభిమానం.. సత్తుపల్లిలో నీరాజనం
.