తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా శ్రీ కోటమైసమ్మ తల్లి జాతర

శ్రీ కోటమైసమ్మ తల్లి జాతర ఖమ్మంలో కన్నులపండువగా కొనసాగుతోంది. మూడు రోజులు జరుగనున్న ఈ జాతరలో భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

By

Published : Oct 9, 2019, 2:02 PM IST

ఘనంగా శ్రీ కోటమైసమ్మ తల్లి జాతర

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో అశేష భక్తసందోహంతో శ్రీ కోటమైసమ్మ తల్లి జాతర కన్నుల పండువగా జరుగుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. రేయింబవళ్లు జాతరలో అమ్మవారిని దర్శించుకుని అక్కడ ఏర్పాటు చేసిన వినోద ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. జాతరను పురస్కరించుకుని ప్రధాన ఆలయంతోపాటు ప్రాంగణంలోని విఘ్నేశ్వరుడు, శివుడు, ఆంజనేయస్వామిని విద్యుత్‌ కాంతుల రూపాలతో ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ, పోలీసులు చర్యలు చేపట్టారు.

ఘనంగా శ్రీ కోటమైసమ్మ తల్లి జాతర

ABOUT THE AUTHOR

...view details