తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆభరణాలతోపాటు సీసీ కెమెరా హార్డ్ డిస్క్ చోరీ...

చోరీకి వచ్చిన దొంగలు ఇంట్లో ఉన్న సుమారు రూ.25 లక్షల విలువ చేసే ఆభరణాలతో పాటు సీసీ కెమెరా హార్డ్ డిస్క్ అపహరించిన ఘటన ఖమ్మం చోటుచేసుకుంది.

By

Published : Aug 4, 2019, 10:24 AM IST

Updated : Aug 4, 2019, 10:37 AM IST

ఆభరణాలతో పాటు..

ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి గాంధీ చౌక్ డబల్ బజారులో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు రూ. 25 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. పని పూర్తయ్యాక సీసీ కెమెరా హార్డ్ డిస్క్, ఇంటి యజమాని కారును తస్కరించారు. ఇంటి యజమాని రెండు రోజుల క్రితం తిరుపతి వెళ్లి... ఈరోజు ఉదయం ఇంటికి చేరుకున్నారు. దొంగతనం జరిగినట్లు గుర్తించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్​స్టేషన్​కు కూతవేటు దూరంలో దొంగతనం జరగడం విశేషం.

ఆభరణాలతో పాటు..
Last Updated : Aug 4, 2019, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details