రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, ఏన్కూరు, కారేపల్లి మండలాల్లో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
హరితహారంలో ప్రతిమొక్కనూ బతికించాలి: ఎమ్మెల్యే రాములునాయక్ - 6th phase of jaritha haaram
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే రాములు నాయక్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతీ ఒక్కరు హరితహారంలో భాగస్వాములు కావాలని రాములు నాయక్ సూచించారు.

'హరితహారంలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యులు కావాలి'
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం 5 విడతల్లో విజయం సాధించిందని కొనియాడారు. అదేస్ఫూర్తితో ఆరో విడత హరితహారంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా... సంరక్షణపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టాలన్నారు.