ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. లకారం ట్యాంక్ బండ్పై కలెక్టర్ కర్ణన్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. కాగడ పట్టుకుని కొంత దూరం పరిగెత్తారు. పరుగులో పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్సీసీ క్యాడెట్లు, క్రీడాకారులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అందరి చేత క్యాచ్ది రైన్ వాటర్ ప్రతిజ్ఞ చేయించారు.