తెలంగాణ

telangana

By

Published : Nov 26, 2020, 4:40 PM IST

ETV Bharat / state

రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న నివర్ తుపాన్​

నివర్ తుపాన్ రాష్ట్రంలో రైతులను వణికిస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరులో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి పండించిన రహదారులపై ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

farmers suffer in khammam paleru constituency with effect of nivar cyclone
రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న నివర్ తుపాన్​

అనుకోకుండా వచ్చిన నివర్ తుపాన్ రాష్ట్రంలో రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరులో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లపై ఆరబోసిన వరిధాన్యం కుప్పలు తడవకుండా ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వ ఆదేశాలతో పండించిన సన్నవరి ధాన్యం దిగుబడి రాక రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ప్రకృతి ప్రకోపానికి అల్లాడుతున్నారు. నివర్ తుపాన్ రావడంతో టార్పాలిన్లను కప్పి ధాన్యాన్ని తడవకుండా రక్షించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

ఇదీ చూడండి:సొంత రాష్ట్రం నడుపుకునే సత్తా ఉందా అని అడిగారు: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details