తెలంగాణ

telangana

సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్న పొంగులేటి

By

Published : Oct 13, 2019, 1:29 PM IST

ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారు.

సహస్ర చండీ యాగాన్ని నిర్వహిస్తున్న పొంగులేటి

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారు. తొమ్మిది మంది పీఠాధిపతుల పర్యవేక్షణలో 200 మందికి పైగా రుత్వికులు ఈ యాగాన్ని చేస్తున్నారు. ప్రజలు అందరూ సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం నిర్వహిస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ యాగం ప్రారంభమైంది. ముందుగా గ్రామంలోని గ్రామ దేవతలకు పూజలు చేశారు. అనంతరం యాగశాలకు వెళ్లి చండీ యాగాన్ని మొదలు పెట్టారు.

సహస్ర చండీ యాగాన్ని నిర్వహిస్తున్న పొంగులేటి

ABOUT THE AUTHOR

...view details