తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుబంధు, రుణమాఫీ చెల్లింపుల్లో జాప్యం'

రైతు సమస్యలపై ఖమ్మం జిల్లా వైరాలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. రైతుబంధు, రుణమాఫీ చెల్లింపులలో కేసీఆర్​ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

By

Published : Sep 12, 2019, 7:03 PM IST

వైరాలో కాంగ్రెస్​ నాయకుల ప్రదర్శన

వైరాలో కాంగ్రెస్​ నాయకుల ప్రదర్శన
రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా వైరాలో కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. రైతుబంధు, రుణమాఫీ చెల్లింపుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చిన నాయకులు అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నారని తెలిపారు. రైతుబంధు తక్షణమే విడుదల చేయాలని తహసీల్దార్​కు వినతిపత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details