తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2021, 1:23 PM IST

ETV Bharat / state

నాంచారమ్మ తల్లి గుడికి ధ్వజస్తంభం కానుక

ఖమ్మం జిల్లాలోని నాంచారమ్మ తల్లి గుడికి ఇద్దరు సోదరులు ధ్వజస్తంభం బహుకరించారు. దీనిని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

khammam district madira latest news
నాంచారమ్మ తల్లి గుడి

ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లారం గ్రామంలో నాంచారమ్మ తల్లి ఆలయానికి కరివేద రాంబాబు సోదరులు భారీ ధ్వజస్తంభం బహుకరించారు. 42 అడుగుల పొడవున్న ఈ రాతి ధ్వజస్తంభానికి గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం గ్రామ వీధుల్లో ఊరేగింపు జరిపారు. త్వరలోనే ఈ ధ్వజస్తంభాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:వెయ్యి కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా.. వెల్లడించిన కాగ్ నివేదిక

ABOUT THE AUTHOR

...view details