రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి. బతుకుదెరువు కోసం ఊరుగాని ఊరు వలసొచ్చారు. తమ ఆశలన్నీ తొమ్మిదేళ్ల కూతురుపైనే పెట్టుకుని బతుకుతున్నారు. అందరి పిల్లల్లాగే తమ బిడ్డను కూడా పెద్ద చదువులు చదివించాలని కలలుగన్నారు. సర్కారు హాస్టల్లో సీటొచ్చిందని సంబరపడిపోయారు. కానీ మాయదారి వసతిగృహం తమ బిడ్డను పొట్టన పెట్టుకుంటుందని ఊహించలేక పోయారు. ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ వసతిగృహంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన బాలిక తల్లి ఆస్పత్రి ప్రాంగణంలో బిడ్డ కోసం పడిన హృదయ వేదన అందరిచేత కంటతడి పెట్టించింది.
ఆశల సౌధం కూలిపోయింది
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెంకు చెందిన బరపటి సంజీవ, లక్ష్మీ దంపతులు బతుకుదెరువు కోసం కొంతకాలం కిందట ఖమ్మం వలస వచ్చారు. తమ కుమార్తె స్పందనకు ప్రభుత్వ వసతి గృహంలో సీటు రావడం వల్ల అందులో చేర్చారు. చక్కగా చదువుతున్న చిన్నారి విద్యుత్ ప్రమాదంలో కడతేరిపోతోందని ఊహించలేకపోయారు.
నాబిడ్డే ఎలా...