కరీంనగర్ జిల్లా కేంద్రంలో వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారి వాతావరణం చల్లగా మారి వాన పడింది. గత రెండు మాసాలుగా వేడితో సతమతమవుతున్న ప్రజలకు వర్షం ఉపశమనాన్ని ఇచ్చింది.
కరీంనగర్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయి వర్షం పడింది.
కరీంనగర్లో వర్షం
ఈ వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. అన్నదాతలు ధాన్యాన్ని అమ్ముకుందామని ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చారు. వడ్ల కొనుగోలు ఆలస్యమవటంతో ఈ రోజు కురిసిన వానకు ధాన్యం తడిసిపోయింది.
ఇదీ చదవండి:స్పుత్నిక్-వి టీకా తొలి డోసు ఇచ్చిన డాక్టర్ రెడ్డీస్