తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​ కలెక్టర్​ కార్యాలయానికి వెల్లువెత్తిన వినతులు

కరీంనగర్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయంలోని ప్రజావాణికి వినతులు అధికంగా వస్తున్నాయి. మండల పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ విఫలమైంది. పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్​ మృతి చెంది మూడేళ్లు కావొస్తున్నా తనకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని జిల్లా జాయింట్​ కలెక్టర్​కు జగన్​ భార్య వినతి పత్రాన్ని అందించారు.

By

Published : Aug 5, 2019, 10:38 PM IST

కరీంనగర్​ కలెక్టర్​ కార్యాలయానికి వెల్లువెత్తిన వినతులు

కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. మండల పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ అధికారులు విఫలమయ్యారు. దీంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న భూ సమస్యల పరిష్కారాన్ని కలెక్టరేట్​లో పరిష్కరిస్తున్నారు. పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్ మృతి చెంది మూడేళ్లు గడుస్తున్నా తనకు ప్రభుత్వము ఇంకా ఉద్యోగం కల్పించలేదని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్​కు జగన్ సతీమణి వినతి పత్రాన్ని అందించారు.

కరీంనగర్​ కలెక్టర్​ కార్యాలయానికి వెల్లువెత్తిన వినతులు

ABOUT THE AUTHOR

...view details