తెలంగాణ

telangana

ETV Bharat / state

మొలంగూర్‌ ఖిల్లాకు కొత్త కళ

గతవైభావాలకు గుర్తు ఆ కోట... చూడగానే అలనాటి రాజుల చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. ఖిల్లా చుట్టూ ప్రహారి గోడ... ఏ వైపు నుంచి శత్రువు ప్రవేశించలేడు. విశాలమైన మైదానం... అక్కడి నుంచి కిందికి చూస్తే పచ్చగా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. అది ఎక్కడా ఉందో అనుకుంటున్నారా.... కరీంనగర్​కు, వరంగల్​కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.

By

Published : Feb 14, 2019, 4:22 PM IST

మొలంగూర్‌ ఖిల్లాకు కొత్త కళ

మొలంగూర్‌ ఖిల్లాకు కొత్త కళ
మొలంగూర్‌ ఖిల్లాకు కొత్త కళఒకవైపు కరీంనగర్​ జిల్లా కేంద్రానికి 35కిలోమీటర్ల దూరంలో, మరోవైపు వరంగల్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది మొలంగూర్ ఖిల్లా. ఎలగందుల, కాకతీయుల కోటల మధ్యలో ఈ ఖిల్లా ఉంటుంది. దీని నిర్మాణాన్ని ఎవరు పట్టించుకోక.. శిథిలమైపోతున్న వేళ.. అధికారులు దృష్టిసారించారు. మరమ్మతులు చేపట్టి పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కోటకు కొత్తశోభ సంతరించుకుంటోంది. రెండుగుట్టల మధ్య ఉన్న ఈ కోటకు తూర్పు పడమరల్లో రెండు ద్వారాలున్నాయి. కొంతదూరం వరకు పైకి ఎక్కడానికి రాతిమెట్లు ఉన్నా.. ఆ తర్వాత పైకి వెళ్లేందుకు ఎలాంటి మార్గం లేదు. ఎంతో ఖ్యాతి ఉన్న మొలంగూరు కోటను పట్టించుకునే వారు లేక... తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఈ విషయాన్ని గమనించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి కోటను పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న కోటల మాదిరిగా దీనిని పర్యటక కేంద్రంగా మార్చారు. కోట పైభాగంలో చుట్టూ ప్రహరీగోడతో పాటు మరఫిరంగులు, ట్రెకింగ్​కు వీలు కల్పించే విధంగా గుట్టలున్నాయి. సాహస క్రీడలు నేర్చుకోడానికి వీలుగా శిక్షకులను ఏర్పాటు చేశారు. ఉదయం వేళల్లో గుట్టపైకి ఎక్కి ట్రెక్కింగ్ నేర్చుకునే అవకాశం కల్పించారు. ఈ ఖిల్లా దిగువన ఓ దూద్ బావి ఉంది. అందులోని నీరు స్వచ్ఛగా ఉంటాయని, వేసవిలోనూ నిండుగా ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. ఆయుర్వేద గుణాలున్న ఈ బావి నీటిని తీసుకెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చారిత్రక కోట శిథిలమౌతున్న వేళ... ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడమే కాకుండా పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details