తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కలు నాటి.. కల్లు పోసిన ఎమ్మెల్యే

కరీంనగర్​ జిల్లా చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి సర్వశక్తులా పని చేస్తానని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ అన్నారు. గంగాధర మండలం నారాయణపూర్​లో హరితహారంలో భాగంగా వెయ్యి ఈత, తాటి మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టారు.

By

Published : Jul 5, 2020, 7:33 PM IST

MLA Sunke Ravi Shankar Visit In Choppadandi
మొక్కలు నాటి.. కల్లు పోసిన ఎమ్మెల్యే

కరీంనగర్​ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పర్యటించారు. నియోజకవర్గంలోని గంగాధర మండలం నారాయణపూర్​లో హరితహారంలో భాగంగా వెయ్యి ఈత, తాటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు.

తాటి వనంలో గీత కార్మికుల బింకితో స్థానికులు, ప్రజా ప్రతినిధులకు కల్లు పోశారు. చొప్పదండి నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ విశేష కృషి చేస్తున్నారని, తనను ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి ఏ సమయంలోనైనా ముందుంటానని, ఏ త్యాగానికైనా వెనకాడనని ఆయన అన్నారు.

ఇదీ చూడండి:విదేశీ యాప్​లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'

ABOUT THE AUTHOR

...view details