తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

మిషన్​ భగీరథ పనుల్లో జాప్యంపై చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ అసంతృప్తి చెందారు. మండల పరిషత్​ సమావేశంలో అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు.

By

Published : May 14, 2019, 5:01 PM IST

సమావేశంలో ఎమ్మెల్యే

కరీంనగర్​ జిల్లా రామడుగులో మండల పరిషత్​ సర్వసభ్య సమావేశం జరిగింది. కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ హాజరయ్యారు. మిషన్​ భగీరథ పైప్​ లైన్ల పనుల్లో అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ప్రతినెల నియోజకవర్గస్థాయిలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదని వాపోయారు.

అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
ఇవీ చూడండి: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు...

ABOUT THE AUTHOR

...view details