తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2021, 9:57 PM IST

ETV Bharat / state

gangula kamalakar: '57 రకాల పరీక్షలు ఉచితం'

కరీంనగర్ జిల్లా కేంద్రం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రెండు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని(diagnostic centre) మంత్రి గంగుల(minister gangula kamalakar), జిల్లా కలెక్టర్ శశాంక, నగర మేయర్ సునీల్ రావులు కలిసి ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్రజలకు 57 రకాల పరీక్షలను ఉచితంగా చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

minister gangula kamalakar
gangula kamalakar: '57 రకాల పరీక్షలు ఉచితం'

కరీంనగర్ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్(minister gangula kamalakar) అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ సెంటర్​ను(diagnostic centre) కలెక్టర్ శశాంక, నగర మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ప్రజలకు రోగ నిర్ధరణ సేవలు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో… ఏక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రప్రథమంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా 57 రకాల పరీక్షలను ఉచితంగా చేయనున్నట్లు స్పష్టం చేశారు.

జిల్లాలోని 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి శాంపిళ్లను సేకరించి… మూడు రూట్ల ద్వారా డయాగ్నోస్టిక్ కేంద్రానికి(diagnostic centre) పంపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ విజయ, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:kodandaram: 'జర్నలిస్టు రఘను వెంటనే విడుదల చేయాలి'

ABOUT THE AUTHOR

...view details