తెలంగాణ

telangana

By

Published : Oct 13, 2019, 8:44 PM IST

ETV Bharat / state

నిండుకుండలా మారిన మానేరు జలాశయం

కరీంనగర్ జిల్లా పరిధిలోని మానేరు జలాశయం జలాశయం నిండుకుండలా మారింది. ఈ రోజు అధికారులు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు.

నిండుకుండలా మారిన మానేరు జలాశయం

కరీంనగర్ జిల్లా పరిధిలోని మానేరు జలాశయం నిండు కుండలా మారి జల కళను సంతరించుకుంది. జలాశయంలో నీరు ఎక్కువగా ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు మానేరులోని నీటిని దిగువకు వదిలారు. స్టేజ్ 1, 2 కాకతీయ కాలువ ద్వారా ఈ ప్రక్రియను కొనసాగించారు. మొదటగా 500 క్యూసెక్కుల నీటి విడుదల చేయగా... రోజుకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.

నిండుకుండలా మారిన మానేరు జలాశయం

ABOUT THE AUTHOR

...view details