తెలంగాణ

telangana

ETV Bharat / state

తీగలపైనే తుదిశ్వాస

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. నిబంధనలు మరచి చేసిన మరమ్మతులకు ఓ కార్మికుడు విద్యుత్ తీగలపైనే తుదిశ్వాస విడిచాడు.

By

Published : Mar 1, 2019, 6:17 AM IST

Updated : Mar 1, 2019, 7:27 AM IST

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

కరీంనగర్​ ఆదర్శనగర్‌లో విరిగిపోయిన విద్యుత్ స్థంభాన్ని మారుస్తుండగా విషాదం చోటు చేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లికి చెందిన శివకుమార్​తో కలిసి శ్రీనివాస్‌ మరమ్మతులు చేస్తున్నాడు. ఒక్కసారిగా విద్యుత్​ సరఫరా జరగడం వల్ల శ్రీనివాస్​ తీగలపైనే ప్రాణాలొదిలాడు. కిందికి దూకి తన ప్రాణాలు దక్కించుకున్నానని శివకుమార్​ తెలిపాడు.

అధికారుల నిర్లక్ష్యమే...
సాయంత్రం 6గంటలకు ఆటోమేటిక్​గా విద్యుత్‌ సరఫరా అవుతుందని.. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. 5 గంటల తర్వాత మరమ్మతులు చేపట్టకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ... అధికారులు నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి:'న్యాయం చేయండి'

Last Updated : Mar 1, 2019, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details