తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​ గడ్డపై భాజపా జెండా : బండి సంజయ్​

కరీంనగర్​ పార్లమెంటు స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా బండి సంజయ్​ కుమార్​ నామినేషన్​ వేశారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే భాజపాకు ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు.

By

Published : Mar 25, 2019, 6:03 PM IST

కరీంనగర్​ గడ్డపై భాజపా జెండా

పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసప్రజలను అయోమయానికి గురి చేస్తోందని కరీంనగర్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్​ అధికారికి నామపత్రాలు సమర్పించారు. కరీంనగర్​ గడ్డపై కాషాయ పతాకం ఎగరడం కాయమని ఆకాంక్షించారు. ఆయన వెంట భాజపా సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి సుగుణాకర్ రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఉన్నారు.

కరీంనగర్​ గడ్డపై భాజపా జెండా

ABOUT THE AUTHOR

...view details