పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు రోజురోజుకు పెంచుతూ మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర భారం మోపుతోందని సీపీఐ నాయకులు ఆరోపించారు. ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.
'ధరలు పెంచుతూ ప్రజలపై కేంద్రం తీవ్ర భారం మోపుతోంది'
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర భారం మోపుతోందని ఆరోపించారు. కరీంనగర్లో వినూత్నంగా నిరసన చేపట్టారు.
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ నిరసన
కరీంనగర్ నగర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ద్విచక్ర వాహనానికి ఉరి వేసుకుంటున్నట్లుగా ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:పెట్రో, గ్యాస్ ధరలతో ప్రజల జీవితాల్లో చీకట్లు: చాడ