తెలంగాణ

telangana

By

Published : Apr 26, 2021, 5:06 PM IST

ETV Bharat / state

రహదారి పక్కన కరోనా టెస్ట్​ సెంటర్.. ఆందోళనలో ప్రజలు

ఓ వైపు కరోనాతో ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే మరోవైపు అధికారుల అలసత్వం ఆ భయాన్ని రెట్టింపు చేస్తోంది. కరోనా టెస్టులను ప్రజలు సంచరించే ప్రాంతాల్లో నిర్వహిస్తూ తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కరీంనగర్​ జిల్లా కేంద్రంలో ఈ దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.

corona test centre in karimnagar
కరీంనగర్​లో కరోనా టెస్టుల సెంటర్​

కరీంనగర్​లో కరోనా పరీక్షా కేంద్రం కాలనీ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. నగరంలోని సప్తగిరి కాలనీలో అద్దె గృహంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్నారు. దానికి ఎదురుగా రహదారికి పక్కన ఆకుపచ్చని పరదాలతో తాత్కాలిక గదులు ఏర్పాటు చేసి.. కరోనా పరీక్షలు చేస్తున్నారు.

దీంతో కాలనీవాసులు, రహదారిపై వెళ్లేవారు జంకుతున్నారు. అధికారులు చొరవ చూపి కేంద్రాన్ని మార్చాలని కాలనీవాసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:‘మా ఇంటికి ఎవరూ రావద్దు.. మేమూ మీ ఇంటికి రాము

ABOUT THE AUTHOR

...view details