తెలంగాణ

telangana

ETV Bharat / state

చొప్పదండిలో కాంగ్రెస్​ కార్యకర్తల ధర్నా

చొప్పదండిలో రైతు సమస్యలపై కాంగ్రెస్​ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

By

Published : Sep 11, 2019, 10:43 PM IST

చొప్పదండిలో కాంగ్రెస్​ కార్యకర్తల ధర్నా

చొప్పదండిలో కాంగ్రెస్​ కార్యకర్తల ధర్నా
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో రైతు సమస్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ -మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. యూరియా కొరత లేకుండా సరఫరా చేయాలని కోరారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ ప్రకటించాలన్నారు. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి తరలించారు. వారు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details