తెలంగాణ

telangana

ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నాయకుల ధర్నా

కరీంనగర్​ జిల్లాలోని షానగర్​ గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు.

By

Published : Nov 29, 2019, 3:06 PM IST

Published : Nov 29, 2019, 3:06 PM IST

cong
ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నాయకులు ధర్నా

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్​లో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ... కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో గ్రామంలోని రహదారిపై బైఠాయించారు.

ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నాయకులు ధర్నా

నెల రోజుల నుంచి తేమ పేరిట కొనుగోళ్లు మరింత ఆలస్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. గంట సేపు ఆందోళన చేయటం వల్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. తాలు పేరిట ధాన్యం లెక్కల్లో కోత విధిస్తున్నారని ఆరోపణ చేశారు. షానగర్ చేరుకున్న తహసీల్దార్ కోమల్ రెడ్డి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శాంతించిన కాంగ్రెస్ నేతలు ఆందోళన విరమించారు.

ఇవీ చూడండి: ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details