తెలంగాణ

telangana

ETV Bharat / state

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ: సీపీ

ప్రజలకు భద్రత కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని కరీంనగర్​ సీపీ కమలాసన్​ రెడ్డి అన్నారు. నగరంలోని వావిలాలపల్లె శ్రీరామ్​నగర్​​లో ఏర్పాటు చేసిన నేను సైతం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.

By

Published : Jan 3, 2021, 4:31 PM IST

cp kamalasan reddy
కరీంనగర్​ సీపీ కమలాసన్​ రెడ్డి

ప్రభుత్వ సహకారంతో ప్రజలకు మరింత భద్రతను కల్పించేలా చర్యలు తీసుకుంటామని కరీంనగర్​ సీపీ కమలాసన్​ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని వావిలాలపల్లె శ్రీరామ్​నగర్​లో నిర్వహించిన నేనుసైతం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక కార్పొరేటర్ గంట కల్యాణితో కలిసి సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు.

శ్రీరామ్​నగర్ కాలనీవాసులు 30 సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. మహిళలను వేధించే పోకీరీలను గుర్తించేందుకు సాధారణ దుస్తుల్లో ఉండేలా పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్మార్​ఫోన్​ కలిగిన ప్రతి ఒక్కరు 'హాక్​ ఐ' యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలని సీపీ సూచించారు. సమావేశంలో పోలీసు కళాకారుల బృందం ఆలపించిన జానపద గేయాలు అలరించాయి.

ఇదీ చూడండి:'బతుకుదెరువు నిలబెట్టాలి- తెలంగాణను కాపాడాలి'

ABOUT THE AUTHOR

...view details